News December 20, 2024
ప్రకాశం: జ్వరాలతో తల్లడిల్లుతున్న రామాయపాలెం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734660493953_52191036-normal-WIFI.webp)
మర్రిపూడి మండలం రామాయపాలెంలో కొద్దిరోజులుగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్యం అందక గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ గ్రామం నుంచి 10 మందికి పైగా ఒంగోలులోని కార్పొరేట్ వైద్యశాలల్లో చేరారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని కొందరు గ్రామంలోనే RMPలచే వైద్యం చేయించుకుంటున్నారు. గురువారం మరికొందరు ఒంగోలు ఆసుపత్రులకు వెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749619093_50216590-normal-WIFI.webp)
పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.
News February 5, 2025
ప్రకాశం: వరల్డ్ కప్ విజేతకు ఘన స్వాగతం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738722826073_60469853-normal-WIFI.webp)
ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738677315258_18483461-normal-WIFI.webp)
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.