News September 28, 2024

ప్రకాశం: టెట్ నిర్వహణకు నాలుగు కేంద్రాల ఎంపిక

image

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ కోసం జిల్లాలో కేంద్రాలను ఎంపిక చేసినట్లు DEO సుభద్ర పేర్కొన్నారు. అక్టోబర్ 3&21 వరకు ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. (1)పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణచైతన్య విద్యాసంస్థ, (2) మార్కాపురం మండలం దరిమడుగులోని జార్జి కళాశాల, (3) ఒంగోలులో నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చి సంస్థ, బ్రిలియంట్స్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News October 10, 2024

ALERT: పొగాకు ఎక్కువ పండించకండి

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.

News October 10, 2024

ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి

image

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.

News October 9, 2024

మార్కాపురం జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.