News April 27, 2024

ప్రకాశం: రూ.2.21 కోట్ల నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2.21 కోట్ల నగదు, 3000 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటివరకు రూ.4.92 కోట్ల మేరా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం వరకు 62 వాలంటీర్లను తొలగించగా, 2,714 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: 9వ స్థానంలో ప్రకాశం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 85.43%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. మొత్తం 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది పాసయ్యారు. 14,880 బాలురులో 12,480 మంది, 14,506 మంది బాలికలు పరీక్ష రాయగా 12,623 మంది పాసయ్యారు.

News April 23, 2025

వెంటిలేటర్‌పై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే?

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత వీరయ్య చౌదరిపై హత్య జరిగడంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ECG తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. హరిబాబు హెల్త్ అప్‌డేట్‌పై హోం మంత్రి అనిత ఆరా తీశారు.

News April 23, 2025

ఒంగోలు: వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

image

ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈయన 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్‌గా ఎన్నికై అనంతరం ఉపసర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నాగులుప్పలపాడు ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

error: Content is protected !!