News February 23, 2025
ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్ను రైతులకు తెలియజేయాలని సూచించారు.
Similar News
News February 23, 2025
కృష్ణా జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరణించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.
News February 23, 2025
కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 23, 2025
కృష్ణా: కేజి చికెన్ ధర ఎంత అంటే.!

మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.110, స్కిన్ లెస్ రూ.120గా ఉందని మాంసాహారులు చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు పూర్తిగా క్షీణించాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కిలోల కొద్దీ చికెన్ అమ్ముకునే వారు ఇప్పుడు తక్కువ పరిమాణంలో కూడా అమ్మకాలు సాగడంలేదని వాపోయారు.