News April 17, 2025
ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్లదే కీలకపాత్ర: రామ్మోహన్ నాయుడు

ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్ల కీలకపాత్ర అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.
Similar News
News April 19, 2025
MBNR: కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ నందు కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రతి కేసు విచారణలో చార్జ్షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. కోర్టు అధికారులు విధులలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 19, 2025
సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.
News April 19, 2025
అలంపూర్ ఆలయ అభివృద్ధికి హై లెవెల్ కమిటీ పరిశీలన

అలంపూర్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం హై లెవెల్ కమిటీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులలో భాగంగా శనివారం ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సభ్యులైన దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, సభ్యులు & దేవాదాయ శాఖ ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతుల వారి శిష్య బృందం ఆలయాన్ని సందర్శించింది. అనంతరం అభివృద్ధి గురించి చర్చించారు.