News February 3, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనకాపల్లి ఎస్పీ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ ఈనెల 29 నుంచి మార్చి 8 వరకు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ కార్యాలయానికి రావద్దని కోరారు.
Similar News
News March 14, 2025
NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.
News March 14, 2025
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో కనీస వసతులు కల్పించాలి: సీపీఎం

వికారాబాద్ జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో కనీస వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా TGSRTC బస్టాండ్లల్లో ప్రయాణికులకు బాత్రూంలు, మంచినీళ్లు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సుల సంఖ్య పెంచాలని మహిపాల్ కోరారు.
News March 14, 2025
BPO ఉద్యోగులకు Shocking News!

AI రాకతో BPO/BPM ఇండస్ట్రీలో హైరింగ్ తగ్గుతుందని నిపుణుల అంచనా. కంపెనీ ఆపరేషన్స్లో రీస్ట్రక్చర్ తప్పనిసరని, ఉద్యోగుల విధులు మారుతాయని అంటున్నారు. డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్టు, లావాదేవీల ప్రక్రియ వంటి సాధారణ పనులకు ఇకపై మనుషుల అవసరం ఉండదని చెప్తున్నారు. AI టాస్కుల పర్యవేక్షణ, దాంతో పనిచేయించే, కలిసి పనిచేసే ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇందుకు వారు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.