News March 28, 2024
ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి సుజనా చౌదరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711605151980-normal-WIFI.webp)
విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థి సుజనా చౌదరి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. 2005లో టీడీపీలో చేరిన ఆయన 2010 నుంచి రెండు విడతలు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. 2014 నుంచి 2018 వరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు. సుజనా చౌదరి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల.
Similar News
News February 8, 2025
కృష్ణా జిల్లా: తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738938144770_1240-normal-WIFI.webp)
ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News February 7, 2025
ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738938144770_1240-normal-WIFI.webp)
ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News February 7, 2025
పలు సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908859044_1127-normal-WIFI.webp)
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.