News April 19, 2025

ప్రభుత్వ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

గిరిజన కుటుంబాలకు రూఫ్ టాప్ కింద సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అర్హతలతో గుర్తించబడిన వారికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

Similar News

News April 20, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ.. 

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2025

జిల్లాలో నేను పెట్టిన రేట్లే ఉండాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

image

ప్రైవేటు బస్సు యజమానులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఓనర్లం చిల్లర వ్యక్తులం అయ్యామని అన్నారు. తాను అనంతపురం జిల్లాలో మీటింగ్ పెడుతున్నానని తెలిపారు. జిల్లాలో నేను పెట్టిన రేట్లు మాత్రమే ఉండాలని అన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా బస్సులు తిప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తాను మొదటిసారిగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడపానని తెలిపారు.

News April 20, 2025

తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!