News February 14, 2025

ప్రాక్టికల్ పరీక్షలకు 122 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.

Similar News

News February 19, 2025

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 9వ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. తాను 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 3 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 8 కేంద్రాలను చెక్ చేసిందన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు. 51 మంది ప్రాక్టికల్స్‌కు రాలేదన్నారు.

News February 19, 2025

నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 18, 2025

నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

image

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

error: Content is protected !!