News March 22, 2024

ప్రొద్దుటూరు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Similar News

News April 20, 2025

గోసేవ మహా పుణ్యకార్యం: కడప కలెక్టర్

image

మైదుకూరు నియోజకవర్గం చల్ల బసాయిపల్లి సమీపంలోని శ్రీ గోపాలకృష్ణ సేవాసమితి ముక్తిధామం గోశాలను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. గోవుల పోషణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గోసేవ మహా పుణ్య కార్యమని ఆయన నిర్వాహకులను ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఆర్డీవో సాయిశ్రీ పాల్గొన్నారు.

News April 19, 2025

కడపలో పోలీసుల శ్రమదానం

image

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త  ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

News April 19, 2025

కడప: వచ్చి మీ ఫోన్ తీసుకెళ్లండి…!

image

కడపలో చాలా మంది తమ ఫోన్లు పొగొట్టుకున్నారు. పోలీసులు ఎంతోకష్టపడి 602 ఫోన్లు రికవరీ చేశారు. ఇందులో 275 మంది తమ మొబైల్స్ తీసుకెళ్లారు. ఇంకా 327 ఫోన్లు పోలీసుల దగ్గరే ఉన్నాయి. సరైన ఆధారాలు చూపింది వీటిని తీసుకెళ్లాలని కడప సైబర్ క్రైం పోలీసులు కోరారు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!