News April 7, 2025
ఫార్మసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్

ఫార్మసి సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్ను నియమిస్తూ రాష్ట్ర ఫార్మసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్ బాబు ఉత్తర్వులు అందజేశారు. ఫార్మసీ చట్టం ప్రకారం ప్రతి మందుల షాపులలో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. 1948 సెక్షన్ 19 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఎలక్షన్స్ జరిపించాలని తెలిపారు.
Similar News
News April 19, 2025
బంగ్లాదేశ్లో హిందూ నేత హత్య

బంగ్లాలో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్పూర్ జిల్లాలో భాబేశ్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషద్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్స్పై వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News April 19, 2025
సంగారెడ్డి: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ

విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించాలని చెప్పారు. మరొకరి మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు.
News April 19, 2025
MBNR: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోకముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. రైతు నష్టపోకుండా విత్తన సంస్థలు,డీలర్లు,నాణ్యమైన లేబుళ్లు ప్యాకింగ్ ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.