News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738929682900_51982755-normal-WIFI.webp)
ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2025
BJPకి అండగా ముస్లిం మహిళలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738997844895_1199-normal-WIFI.webp)
ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమందా వంటి వెనకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న IUML ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం, అనుచరులను ప్రభావితం చేయడమూ కలిసొచ్చిందని అంటున్నారు.
News February 8, 2025
‘లైలా’కు A సర్టిఫికెట్: విశ్వక్ సేన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998185948_1045-normal-WIFI.webp)
తన తాజా సినిమా ‘లైలా’కు సెన్సార్ బోర్డు ‘A’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చిందని హీరో విశ్వక్ సేన్ వెల్లడించారు. మూవీ చూస్తే ‘A’ సర్టిఫికెట్ ఎందుకో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ప్రేక్షకులు రొటీన్ మూవీస్ని చూడటం లేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన కథను సెలక్ట్ చేశాం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కానీ లేడీ గెటప్ వేయడమే కష్టంగా అనిపించింది’ అని స్పష్టం చేశారు.
News February 8, 2025
ఆమన్గల్కు 13న కేటీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981063852_52296546-normal-WIFI.webp)
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న పదిహేను వేల మందితో రైతు దీక్ష ఉండనుంది. ఈ దీక్ష మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమనికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు మహాదీక్షకి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.