News March 15, 2025
‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.
Similar News
News March 16, 2025
నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలకు 312 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రూ నాయక్ తెలిపారు. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు నల్గొండ జిల్లాలో 11,888 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,576 మంది హాజరయ్యారు. 312 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు.
News March 16, 2025
‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు.
News March 15, 2025
దామరచర్ల: గ్రూప్-2, 3లో సత్తాచాటిన శశి కుమార్

దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన రాయికింది శశి కుమార్ ఇటీవలే వెలువడిన గ్రూప్-3 ఫలితాలలో 19 రాంక్, గ్రూప్-2లో 12 ర్యాంక్ సాధించాడు. శశి కుమార్ తండ్రి రామ్మూర్తి మిర్యాలగూడ ట్రాన్స్ కో లైన్మెన్గా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహకంతోనే ర్యాంకు సాధించానని శశికుమార్ తెలిపారు. శశికుమార్ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.