News March 7, 2025
ఫ్రీ బస్.. ప్రజల భిన్నాభిప్రాయాలు

ATP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ జర్నీ జిల్లా వరకే పరిమితం.. మీ కామెంట్’ అంటూ వే2న్యూస్ అనంతపురం జిల్లాలో వార్త <<15677166>>పబ్లిష్<<>> చేయగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. 41శాతం మంది దీనిని స్వాగతించారు. మరికొందరు ఈ పథకం వద్దని, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, కాలేజ్ పిల్లల వరకు పరిమితం చేయాలని కొందరు కామెంట్ చేశారు.
Similar News
News April 25, 2025
మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్ను అభినందించారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్ను అభినందించారు.