News February 9, 2025
బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739105527022_52300774-normal-WIFI.webp)
ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 10, 2025
చిత్తూరు సమీపంలో బాంబ్ బ్లాస్ట్.. ఒకరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739160576190_52300774-normal-WIFI.webp)
చిత్తూరు సమీపంలో బాంబ్ పేలి ఒకరు చనిపోయారు. ఉయ్యాల చింత వద్ద రోడ్డు పనుల్లో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. అక్కడే పనిచేస్తున్న అంజు స్పాట్లోనే చనిపోయారు. యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
RCపురం: చెరువులో పడి యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739154558922_673-normal-WIFI.webp)
ప్రమాదవశాత్తు యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి(D) రామచంద్రాపురం(M) రాయలచెరువుపేటకు చెందిన లోకేశ్(23) స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. శనివారం స్కూల్ అయిపోయిన తర్వాత బైకుపై రామచంద్రాపురం నుంచి ఇంటికి బయల్దేరారు. ప్రమాదవశాత్తు రాయలచెరువులో పడిపోయాడు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో మృతదేహాన్ని గుర్తించారు.
News February 10, 2025
తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నలుగురు అరెస్టు.. ఏ1 ఎవరో ..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739152895051_673-normal-WIFI.webp)
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురు కీలక నిందితులను సిట్ ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు ఏ4 విపిన్ జైన్, ఏ3 పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్, ఏ2 ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్లను అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడెవరో ఇంకా నిర్ధారించలేదు. టీటీడీలో పనిచేసిన కీలక అధికారి లేదా బోర్డులోని కీలక వ్యక్తిని కేసులో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.