News February 13, 2025
బర్డ్ ప్లూతో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

ఉంగుటూరు(M) బాదంపూడిలో పౌల్ట్రీలో బర్డ్ ప్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందని, 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కార్యాచరణ పై కలెక్టర్ పలు శాఖల వారితో సమీక్షించారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్ 9966779943 ఏర్పాటు చేశామన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోయినా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 20.05 బేల 19.63, జైనథ్19.42, బోరజ్ 23.60, భీంపూర్ 24.93, సాత్నాల 28.00, తాంసి 24.26, మావలలో 16.40 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
బాలకృష్ణ, బోయపాటి.. 4 సినిమాల్లో ఏది నచ్చింది?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే యాక్షన్ భారీ స్థాయిలో ఉంటుంది. హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు 4 సినిమాలొచ్చాయి. సింహా(2010), లెజెండ్(2014), అఖండ(2021), అఖండ-2: తాండవం(2025) మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాల్లో బాలకృష్ణ గెటప్స్, డైలాగ్స్, ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. మరి వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.
News December 14, 2025
కామారెడ్డి జిల్లాలో 20.96% పోలింగ్

కామారెడ్డి జిల్లాల్లో రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఉ.9 గంటల వరకు 7 మండలాల్లోని నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
గాంధారి మండలంలో 27.74%,
లింగంపేట -9.94%
మహమ్మద్ నగర్- 20.42
నాగిరెడ్డిపేట్-19.51%
నిజాంసాగర్- 24.85%
పిట్లం- 20.19%
ఎల్లారెడ్డి- 28.53%
పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


