News March 15, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.
Similar News
News March 17, 2025
MBNR: ప్రేమించుకుని పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
News March 17, 2025
బాలానగర్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాదస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లత (34) ఈనెల 14న ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. ఆదివారం పెద్దయపల్లి గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News March 16, 2025
జడ్చర్ల: మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు

మండలంలోని కోల్బాయితండాకు చెందిన శారద(45) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. శారద భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో కుమారుడు, కోడలి దగ్గర కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తనను వేధిస్తున్నారని తండ్రి తథ్యుతో వాపోయింది. ఈ నేపథ్యంలోనే శారద ఆత్మహత్య చేసుకోగా.. అందుకు కారకులుగా మృతురాలి కుమారుడు, కోడలే అని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.