News April 3, 2025

బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్‌ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.

Similar News

News April 10, 2025

ఆ రైతులకు త్వరలోనే నష్టపరిహారం: మంత్రి తుమ్మల

image

TG: మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ నెల 3-9 వరకు రాష్ట్రంలో వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదిక అందిందని వెల్లడించారు.

News April 10, 2025

OFFICIAL: పూరీ-సేతుపతి సినిమాలో టబు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఒక డైనమిక్ క్యారెక్టర్ కోసం ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2025

ADB: ‘గోండి భాషలో రచనలు చేయడం అభినందనీయం’

image

నూతన DEO ఏ.శ్రీనివాస్‌రెడ్డిని పండోక్న మహాభారత్ కథా రచయిత తొడసం కైలాస్ కలిసి తాను రచించిన పుస్తకాన్ని బహూకరించారు. DEO మాట్లాడుతూ.. కైలాస్ గోండి భాషలో రచించడం అభినందనీయమని అన్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో డ్రాపౌట్ పిల్లలను గత పదేళ్లుగా వారి చదువు కొనసాగేటట్లు ఓపెన్ స్కూల్‌లో జాయిన్ చేసినందుకు కైలాస్‌ను అభినందించారు. MEO సోమయ్య, AMO శ్రీకాంత్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

error: Content is protected !!