News February 8, 2025

బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీ రిజల్ట్స్: అత్యధిక మెజారిటీ ఎవరికంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ(మటియా మహల్- 42,724 ఓట్లు)తో ఆప్ నేత మహమ్మద్ ఇక్బాల్ బీజేపీ అభ్యర్థి దీప్తిపై విజయం సాధించారు. మరోవైపు అత్యల్ప మెజార్టీ(344 ఓట్లు)తో సంగం విహార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి చందన్ కుమార్ నెగ్గారు. ఓవరాల్‌గా ముగ్గురు BJP అభ్యర్థులు వెయ్యి లోపు మెజార్టీతో విజయం సాధించారు. పలు చోట్ల మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడటం గమనార్హం.

News February 8, 2025

నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

image

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ <>నోటిఫికేషన్ <<>>విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. ఫీజు రూ.300. CBT, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో CBT పరీక్షలు జరగనున్నాయి. సైట్: iocl.com

News February 8, 2025

విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న MHBD కలెక్టర్

image

గూడూరులో కేజీబీవీ ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు వండిన వంటలను పరిలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను సంబధిత వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూమ్‌లలోకి వెళ్లి విద్యార్థులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు విద్యార్దులు తమకు తెలపాలన్నారు.

error: Content is protected !!