News May 30, 2024
బాన్సువాడ: మహిళపై హత్యాచారం చేసి బంగారం చోరీ
మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. గాంధారిలోని నేరల్ గ్రామానికి చెందిన దత్తు కూరగాయాలు అమ్మె లక్ష్మీతో పరిచయం పెంచుకున్నాడు. అతడి స్నేహితుడు ప్రసాద్తో కలిసి ఆమెను ఈ నెల 16న కృష్ణానగర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేసి ఆమె తలపై రాయితో కొట్టి చంపేశారు. అనంతరం బంగారం, రూ.10వేల నగదు తీసుకొని పరారైనట్లు CI కృష్ణ తెలిపారు.
Similar News
News February 12, 2025
నిజామాబాద్లో ఫొటో జర్నలిస్టు మృతి
నిజామాబాద్లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.
News February 12, 2025
NZB: టెన్త్ అర్హతతో 42 ఉద్యోగాలు
నిజామాబాద్ డివిజన్లో 42 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.