News February 1, 2025

బాన్సువాడ: శంకుస్థాపన చేయనున్న హైకోర్టు జడ్జీలు

image

బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూతన భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జే.శ్రీనివాస్ రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేయనున్నట్లు బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ, బిచ్కుంద కోర్టు పరిధిలోని న్యాయవాదులు సిబ్బంది హాజరుకావాలన్నారు.

Similar News

News February 1, 2025

Stock Markets: రైల్వే, డిఫెన్స్ షేర్లపై ఫోకస్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 97 పాయింట్ల మేర నష్టపోవడం దీనినే సూచిస్తోంది. బడ్జెట్ మొదలయ్యాక సెంటిమెంటును బట్టి ఎటువైపైనా స్వింగ్ అవ్వొచ్చు. వృద్ధి, వినియోగం, ఇన్ఫ్రా, SMEలపై ఫోకస్ నేపథ్యంలో రైల్వే, డిఫెన్స్, బ్యాంక్స్, PSE షేర్లపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ కావడంతో శనివారమైనా స్టాక్‌మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.

News February 1, 2025

జగిత్యాల: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

మెట్‌పల్లి చింతల్‌పెట శివారులో శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇబ్రహీంపట్నం వేములకుర్తికి చెందిన బర్మా నగేశ్(32) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చింతల్‌పేట-వేములకుర్తికి వెళ్తున్న నగేశ్.. మెట్‌పల్లి-యూసుఫ్‌నగర్‌కు వస్తున్న సోఫియాన్ బైకులు చింతలపేట శివారులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందగా సోఫియాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News February 1, 2025

నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ?

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సర్వర్‌లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.