News March 14, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

◆ పర్చూరు అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి◆ఉపాధి కూలీలు అపోహలు పడవద్దు: కొరిశపాడు ఏపీవో◆వేటపాలెం: అక్రమ మద్యం స్వాధీనం◆కొల్లూరు: మట్టి రోడ్డుకు అభివృద్ధి పనులు◆సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే ఏలూరి◆వారంలో ఒకరోజు గ్రామ పర్యటన: వేగేశన◆కారంచేడు: లంపి వైరస్తో ఆవులు విలవిల◆మాణిక్యవేల్ మృతి బాధాకరం: వేమూరు ఎమ్మెల్యే◆సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!

Similar News

News March 15, 2025

భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ పనులు ప్రారంభం

image

TG: భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మెుదలయ్యాయి. శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా అర్చకులు రోలు రోకలికి పూజచేసి పసుపు కొమ్ములు దంచారు. బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్’ యాప్‌ను ఈవో ఆవిష్కరించారు. యాప్ సేవలు పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

News March 15, 2025

బాపట్ల జిల్లాలో ఒంటిపూట బడులు: DEO

image

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. SSC పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు బడి నిర్వహించాలన్నారు.

News March 15, 2025

తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ, రేపు క్యూలైన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించనున్నారు. ఎల్లుండి నుంచి టీటీడీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు గాయపడినవారిని విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 17న విచారణకు రావాలని కలెక్టర్‌తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవోకు నోటీసులు పంపారు.

error: Content is protected !!