News February 27, 2025
బాపట్ల జిల్లాలో 29.29 శాతం పోలింగ్

బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 24,493 ఓటర్లు ఉన్నారు. ఉదయం 10 గంటలకు 4,787 మంది పురుషులు, 2,386 మంది ఓటు వేశారని జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 29.29 శాతం పోలింగ్ జరిగిందన్నారు.
Similar News
News December 19, 2025
జిల్లాకు 200 పెన్షన్లు.. శుభవార్త చెప్పిన సీఎం

AP: కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ IAS కలెక్టర్ల సదస్సులో చెప్పగా CM వెంటనే స్పందించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు జిల్లాకు 200 చొప్పున పెన్షన్ల మంజూరుకు అనుమతి ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.
News December 19, 2025
HYD బుక్ ఫెయిర్ మొదలైంది అప్పుడే..!

హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి DEC 29 వరకు బుక్ ఫెయిర్ జరుగుతుంది. 1985లో మొదట అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ఫెయిర్, తరువాత నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లకు విస్తరించింది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
FIFA WC విజేతకు రూ.450 కోట్లు

వచ్చే ఏడాది జూన్ 11 నుంచి జులై 19 వరకు US, కెనడా, మెక్సికోలో ఫుట్బాల్ WC జరగనుంది. దీని నిర్వహణ, 48 జట్లకు పంపిణీ చేసేందుకు దాదాపు ₹6,000Crను FIFA వెచ్చించనుంది. విజేతకు ₹451Cr, రన్నరప్కు ₹297Cr, మూడో స్థానానికి ₹261Cr, ఫోర్త్ ప్లేస్కు ₹243Cr అందించనుంది. 5-8 స్థానాల్లోని జట్లకు ₹171Cr, 9-16 టీమ్స్కు ₹135Cr, 17-32 జట్లకు ₹99Cr, 33-48 స్థానాల్లో నిలిచిన జట్లకు ₹81Cr చొప్పున డబ్బు ఇవ్వనుంది.


