News May 17, 2024
బాపట్ల జిల్లాలో పర్యటించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లా విచ్చేసిన ఆయనకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాపట్లలో ఎన్నికలు జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
Similar News
News April 23, 2025
10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరించేనో?

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
News April 23, 2025
గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.