News April 21, 2025
బాపట్ల: బాధితులకు న్యాయం చేస్తాం- ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్ట పరంగా విచారించి చర్యలు చేపడతామన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
అనకాపల్లి పోలీస్ ప్రజా వేదికలో 45 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు 45 ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ తుహీన్ సిన్హా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 21, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేటలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ డే
☞ వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
☞ వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో హార్టికల్చర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
☞ చిలకలూరిపేట: బొమ్మల షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
☞ సత్తెనపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి
☞ రొంపిచర్ల: 6తరగతి ప్రవేశ పరీక్షలకు 221 మంది హాజరు
News April 21, 2025
అనకాపల్లి: ‘టీనేజ్ ప్రెగ్నెన్సీతో అనర్థాలు’

అనకాపల్లి: బాల్య వివాహలను కట్టడి చేయడంలో మహిళా పోలీసులది కీలక పాత్ర వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. సూర్యకుమారి తెలిపారు. కలెక్టరేట్లో పలువురి అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై ఎక్కువగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.