News February 13, 2025
బాపట్ల: స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739446364839_51982755-normal-WIFI.webp)
స్కానింగ్ సెంటర్లను వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా చెప్పారు. గురువారం బాపట్ల ఆర్డీవో కార్యాలయం నందు సబ్ డిస్ట్రిక్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 14, 2025
12 ఏళ్లకే రాజుగా పట్టాభిషేకం.. 20వేల కోట్ల ఆస్తి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739451616920_746-normal-WIFI.webp)
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన మహారాజా పద్మనాభ్ సింగ్కు 12ఏళ్ల వయసులోనే రాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రస్తుతం 26ఏళ్ల వయసులో రూ.20వేల కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఇంత డబ్బున్నా చదువుతో పాటు క్రీడలను వదల్లేదు. పోలో ఆటలో నైపుణ్యం సాధించి 2017లో IND జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. వారసత్వ కట్టడమైన సిటీ ప్యాలెస్ను పర్యాటకుల కోసం ఉంచారు. తల్లితో కలిసి మహిళలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.
News February 14, 2025
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739464095706_51926657-normal-WIFI.webp)
జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
News February 14, 2025
IPLలో తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739465718378_1045-normal-WIFI.webp)
ఈ ఏడాది IPL షెడ్యూల్కు సంబంధించిన కీలక వివరాలను క్రిక్బజ్ వెబ్సైట్ వెల్లడించింది. ‘బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో మార్చి 22న(శనివారం) కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ టీమ్ సన్రైజర్స్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్ మీద తలపడనుంది. ఇక మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది’ అని పేర్కొంది.