News February 23, 2025

బాలానగర్‌‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

image

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 24, 2025

నర్సాపూర్: ముగిసిన ఈ-బగ్గీల పోటీలు

image

బగ్గీల పోటీలను దక్షిణ భారతదేశంలో 2వ సారి నిర్వహించినందుకు గర్వంగా ఉందని BVRIT యాజమాన్యం తెలిపారు. నర్సాపూర్ సమీపంలోని BVRIT కళాశాల ఆవరణలో నిర్వహించిన బగ్గీల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారాలను ఆయా ప్రముఖుల చేత విజేతలకు అందజేశారు. ప్రముఖులు బగ్గీల విశిష్టత, పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం తీరు, విలువలను వివరించారు.

News February 24, 2025

టాప్‌లో భారత్.. లాస్ట్‌లో పాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్‌లో భారత్ టాప్ ప్లేస్‌కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో రెండో స్థానంలో, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఇక కివీస్, భారత్ చేతిలో ఓడిన పాక్ 0 పాయింట్ల(NRR -1.087)తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లీగ్ దశ ముగిసేలోపు టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ వెళ్తాయి.

News February 24, 2025

అధైర్య పడొద్దు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: ఎమ్మెల్యే బొజ్జు

image

ఉట్నూర్ మండలం లక్షటిపేటకు చెందిన ఉప్పు నర్సయ్య ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం బాధిత కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దని త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.

error: Content is protected !!