News June 7, 2024

బీజేపీలో బండి తనదైన మార్క్!

image

కరీంనగర్ నుంచి పలువురు కీలక నేతలు రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాబోతున్న BJPలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ రెండోసారి కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకురావడంలోనూ కీలకంగా వ్యవహరించారు. మొదట్లో కార్పొరేటర్‌గా, అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా కొనసాగారు.

Similar News

News October 2, 2024

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: మాజీ MLA సతీశ్ కుమార్

image

మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కొండా సురేఖకు కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు.

News October 2, 2024

కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీపై బీఆర్ఎస్ వైఖరిని తెలపాలన్నారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని అన్నారు.

News October 2, 2024

విజయభారతికి నివాళులర్పించిన కేటీఆర్

image

ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా తల్లి, ప్రముఖ రచయిత్రి విజయభారతి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాహుల్ బొజ్జ నివాసానికి వెళ్లి వారీ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విజయ భారతి మరణం బాధాకరమని ఆవేదన చెందారు. విజయభారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.