News March 3, 2025

బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

image

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Similar News

News March 3, 2025

రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.

News March 3, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ✷ ద్వారకాతిరుమల సిబ్బంది నిజాయితీ ✷ దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత✷ సామాన్య కుటుంబాల నుంచి ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన యువత✷ మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి ✷అసెంబ్లీలో గళం విప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు

News March 3, 2025

WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

error: Content is protected !!