News April 19, 2025
బూర్జ : స్విమ్మింగ్లో అరుదైన రికార్డు

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.
Similar News
News April 20, 2025
వివాహిత హత్య.. నిందితుడి కోసం గాలింపు

రణస్థలంలోని పైడిభీమవరంలో నడిరోడ్డుపై శనివారం వివాహిత భవాని దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి చాకుతో ఆమె గొంతుకోసి సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగి పడేసి వెళ్లాడు. మృతురాలు పని చేస్తున్న హోటల్లోని వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ స్వగ్రామం విజయనగరం(D) పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరంలోని వెంకట సత్యంతో ఈమెకు వివాహమైంది.
News April 20, 2025
నేడే మెగా డీఎస్సీ.. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు

ఆదివారం ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు కలవు. ఇందులో SA లాంగ్వేజ్-1లో 37, SA హిందీ 11, SA ఇంగ్లీష్ 65, SA మ్యాథ్స్ 33, SA-PS 14, SA-BS 34, SA సోషల్ 70, SA-PE 81, SGT 113 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వేల్ఫేర్ ఆస్రంలో 85 పోస్టులు భర్తీ చేయనున్నారు.
News April 20, 2025
ఇచ్ఛాపురంలో నేడు కేంద్రమంత్రి పర్యటన

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.