News March 18, 2025
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

యువత, విద్యార్థులు బెట్టింగ్కు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్ ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, దానిని మంచికి వినియోగించాలన్నారు.
Similar News
News March 19, 2025
MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS
News March 19, 2025
జగిత్యాల: కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు బుధవారం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఇతర ఉద్యోగుల మాదిరిగా సెలవులు కేటాయించాలన్నారు. వీరికి సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
News March 19, 2025
GATE ఫలితాలు విడుదల

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం ఇక్కడ <