News February 5, 2025

బెల్లంపల్లి: ‘కడసారి చూపుకైనా ఇంటికి రండి’

image

కుటుంబాలను వదిలి అడవుల్లో ఇంకా ఎంతకాలం బ్రతుకంతా వెళ్లదిస్తారు. తాను ఇంకా ఎంతోకాలం బతకనని కడసారి చూపుకైనా ఇంటికి రావాలని మావోయిస్టు నేత పుష్పతల్లి మల్లక్క వేడుకుంది. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని మావోయిస్టు సభ్యురాలు పుష్ప తల్లి జాడి మల్లక్క, సోదరుడు పోషంను CP శ్రీనివాస్ కలిసి వారిని పరామర్శించారు. మల్లక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

Similar News

News February 5, 2025

భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!

image

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.

News February 5, 2025

అంతర్వేదికి ప్రత్యేక బస్సులు

image

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7న స్వామివారి కళ్యాణం, 8న రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజులు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అమలాపురం డిపో మేనేజర్ సీహెచ్.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. అమలాపురం-అంతర్వేది, అప్పనపల్లి- అంతర్వేది, పల్లం-అంతర్వేది రూట్లో 46 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.

News February 5, 2025

నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ 

image

కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!