News March 1, 2025

బెల్లంపల్లి: హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్

image

2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ CI అబ్జలుద్దీన్ తెలిపారు. చర్లపల్లి జంకాపూర్‌కు చెందిన మహేందర్‌పై సన్నీ, బానేశ్, ఆదిత్య, సాయి కత్తితో దాడి చేశారు. మొక్క జొన్న అమ్మకానికి గుడిసే ఏర్పాటు చేయకూడదని అతడిపై దాడి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News March 3, 2025

అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన కోహ్లీ..!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్‌ మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వికెట్ తీసిన సందర్భంగా అక్షర్ పటేల్ కాళ్లను తాకేందుకు విరాట్ కోహ్లీ ప్రయత్నించారు. ఇదంతా ఆయన సరదాగా చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇవాళ్టి మ్యాచులో అక్షర్ అన్ని విభాగాల్లోనూ రాణించారు. 47 పరుగులు చేసి ఓ వికెట్ పడగొట్టారు. ఫీల్డింగ్‌లో ఓ అద్భుత క్యాచ్ పట్టారు.

News March 3, 2025

మార్చి 03: చరిత్రలో ఈ రోజు

image

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్‌షెట్జీ టాటా జననం
1847: టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం
1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం
1967: ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ జననం
1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం
2002: తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగి మరణం
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

News March 3, 2025

NZB: పానీపూరి తిని కత్తితో దాడి

image

ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్‌ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.

error: Content is protected !!