News February 24, 2025

బైక్ అదుపుతప్పి మందమర్రి వాసి మృతి

image

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫ్లైఓవర్ పైన బైక్ అదుపుతప్పి KK-OCPలారీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..షేక్ ముగ్ధం, షేక్ జిలాని ఇద్దరు అన్నదమ్ములు బైకుపై మంచిర్యాల వెళ్లి వారి మేనమామ ఇంటికి బెల్లం పల్లికి వెళుతుండగా మందమర్రి ఫ్లై ఓవర్ పైన జిలాని డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు. జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. మగ్గంకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 24, 2025

విశాఖ: 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..❤

image

విశాఖ జిల్లా ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. 1998-99లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. చదువులు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు. మీరూ ఇలా చేశారా? చివరిసారి ఎప్పుడు గెట్ టూ గెదర్ చేసుకున్నారో కామెంట్ చేయండి.

News February 24, 2025

తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(రూ.300)ను టీటీడీ విడుదల చేసింది. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను అధికారిక సైట్‌లోనే బుక్ చేసుకోవాలని <>టీటీడీ<<>> తెలిపింది. ఫేక్ వెబ్ సైట్లు, దళారుల వద్ద మోసపోవద్దని సూచించింది.

News February 24, 2025

మద్దూరు: అదృశ్యమై.. శవమై కనిపించాడు

image

మద్దూరు మండలంలో ఓ గుర్తు <<15554760>>తెలియని <<>>వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాలు.. రెనివట్ట గ్రామానికి చెందిన రాములు(50) గత నెల 20న ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆదివారం ఆయన చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాములుగా గుర్తించారు.

error: Content is protected !!