News April 4, 2025
బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 16, 2025
అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

AP: అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని, త్వరలోనే అమరావతి మెగాసిటీ కుట్ర బయటకొస్తుందని పేర్ని నాని వెల్లడించారు.
News April 16, 2025
50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష: వేపాడ

డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు బుధవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News April 16, 2025
బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.