News September 20, 2024
బోథ్: రూ.81 వేల ధర పలికిన గణేశ్ లడ్డూ
బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గణేశ్ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.
Similar News
News September 20, 2024
మంచిర్యాల: పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి ఆత్మహత్య
పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్(36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేశ్ మంచిర్యాలలో నివాసం అంటూ మెప్మాలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News September 20, 2024
ADB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.
News September 19, 2024
ADB: ప్రశాంతంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ 11 రోజుల పాటు నిద్రాహారాలు మాని విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలకు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.