News April 6, 2025

భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

image

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Similar News

News April 9, 2025

రంగారెడ్డి: ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు: కలెక్టర్

image

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రేషన్‌కార్డు లేదా ఆహారభద్రత కార్డు ఉంటే సరిపోతుందని తెలిపారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 14 వరకు అన్ని మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 9, 2025

VZM: ‘డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

image

ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సిద్ధమయ్యే డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురజాడ అప్పారావు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ కె.జ్యోతిశ్రీ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో గల కస్పా హైస్కూల్ వద్ద ఉన్న ఏపీ బీసీ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తులు అందించాలన్నారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.

News April 9, 2025

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

image

సలేశ్వరం జాతరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలిపారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా సకాలంలో బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు.

error: Content is protected !!