News April 5, 2025

భద్రాచలానికి పాదయాత్రగా వచ్చిన 7వేల మంది భక్తులు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకున్నారు. ఉగాది నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శనివారం భద్రాచలం చేరుకున్నట్లు వారు తెలిపారు. ప్రతీ ఏటా శ్రీరామనవమికి పాదయాత్రగా వస్తామని చెబుతున్నారు.

Similar News

News April 7, 2025

అఖిల్ నెక్స్ట్ మూవీ.. రేపు గ్లింప్స్?

image

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వచ్చి రెండేళ్లైనా ఆయన మరే ప్రాజెక్టునూ అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్‌కు అఖిల్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతోనైనా అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

News April 7, 2025

నేటి నుంచి ‘అడవితల్లి బాట’.. ప్రారంభించనున్న పవన్

image

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

News April 7, 2025

MHBD: ఏడేళ్ల చిన్నారిపై కిడ్నాప్‌కు యత్నం

image

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాలో ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సోదరుడు, మరో బాలుడితో చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చి చిన్నారిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని వెళ్లారు. చిన్నారి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయారు.

error: Content is protected !!