News February 10, 2025
భద్రాద్రి: 50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739112670519_1280-normal-WIFI.webp)
భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.
Similar News
News February 11, 2025
కదిరి: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739197997154_52254236-normal-WIFI.webp)
కదిరి అడపాల వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఆత్మహత్య కేసులో భర్త కేశవయ్యను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన భర్త కేశవయ్య పెడుతున్న హింసలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం కేశవయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
News February 11, 2025
రంగరాజన్పై దాడిచేసిన వీరరాఘవ రెడ్డి నేపథ్యమిదే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234891754_367-normal-WIFI.webp)
చిలుకూరు బాలాజీ అర్చకుడు <<15409945>>రంగరాజన్పై దాడిచేసిన<<>> వ్యక్తి వివరాలు బయటకొచ్చాయి. తూ.గో. జిల్లా కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించి తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాలు తిరుగుతూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇతడు చట్టాలపై మంచి పట్టు తెచ్చుకున్నారు. 2015లో తన కూతురి అడ్మిషన్ విషయంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్పై కేసు వేసి గెలిచారు.
News February 11, 2025
నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739235501062_727-normal-WIFI.webp)
ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.