News March 25, 2025

భద్రాద్రి కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తండా వాసులు

image

దాసు తండా, రేగుల తండాలలో గత రెండేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని తండావాసులు మంగళవారం అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలో బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు బోడు వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని వాపోయారు.

Similar News

News March 26, 2025

ధర్మారం: మద్యానికి బానిసై యువకుడి సూసైడ్

image

మద్యానికి బానిసై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మారం మండలం కొత్తూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన నవీన్ (29) మద్యానికి బాగా బానిసయ్యాడు. దీంతో అతడి భార్య తనను వదిలివెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News March 26, 2025

వేసవిలో చర్మం రంగు మారుతుందా?

image

వేసవిలో ఎండకు చర్మం రంగు నల్లగా మారుతుంది. UV కిరణాలకు గురికావడం టానింగ్‌కు కారణమవుతుంది. దీనిని నివారించేందుకు ఫుల్ స్లీవ్ గ్లౌజులు ధరించడం ఉత్తమం. కలబంద జెల్‌ను ముఖం, చేతులు, మెడపై అప్లై చేయడం ప్రయోజనకరం. వీటితో పాటు చర్మాన్ని బట్టి ఇంట్లో ఉండే శనగపిండి, పసుపు, పాలు, తేనె, రోజ్ వాటర్‌, ముల్తాన్ మట్టితో ఫేస్‌ప్యాక్ చేసుకొని ముఖం, చేతులు, మెడకు అప్లై చేసుకోవచ్చు.

News March 26, 2025

మంచిర్యాల: నేటి పరీక్షకు 31 మంది గైర్హాజరు

image

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో జరిగిన గణిత శాస్త్రం పరీక్షకు 9,198 మంది విద్యార్థులకు గాను 9,178 విద్యార్థులు, గతంలో ఫెయిలైన 90 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మొత్తం 9,288 మందికి 9,257 విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.

error: Content is protected !!