News February 12, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739374097420_19535177-normal-WIFI.webp)
✓ బర్డ్ ఫ్లూ.. భద్రాద్రి జిల్లా సరిహద్దులు అప్రమత్తం ✓ చర్ల: 30 ఏళ్లుగా ఆ బడికి టీచర్ లేరు ✓ జేఈఈ మెయిన్స్లో గుండాల విద్యార్థుల ప్రతిభ ✓ రోడ్డు ప్రమాదంలో అశ్వాపురంలో యువకుడి మృతి ✓ RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఖండించిన కూనంనేని ✓ జిల్లాలో శివరాత్రి వేడుకలకు ఆలయాల ముస్తాబు ✓ చర్ల: 6 గ్యారంటీలు అమలు చేయాలి: CPIML న్యూడెమోక్రసీ ✓ మణుగూరులో కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్.
Similar News
News February 13, 2025
మేడ్చల్ జిల్లాలో సిజేరియన్లు భారీగా పెరిగాయి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739320531349_15795120-normal-WIFI.webp)
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయి. కొద్దిసేపు గర్భిణీకి నొప్పులు రాగానే తట్టుకోలేకపోవడంతో ఒత్తిడి తెచ్చి కుటుంబీకులు సీజేరియన్ కోసం అడుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలో 56కుపైగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. సాధారణ ప్రసవాలకు మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగుతుండటంతో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 13, 2025
ఒంగోలు: ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739378395910_50215650-normal-WIFI.webp)
లారీని అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2019లో పోతవరం కుంట వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఆదినారాయణను అరెస్ట్ చేసి హాజరు పరచగా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News February 13, 2025
కర్నూలు: టెన్త్ అర్హత.. 70 కంపెనీల్లో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363610813_50597895-normal-WIFI.webp)
ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.