News April 21, 2025

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

image

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కవిత గర్భగుడిలో కొలువై ఉన్న సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముల వారి ఆశీస్సులతో TG రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను అని తెలిపారు.

Similar News

News April 21, 2025

బాపట్ల జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

image

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో బాపట్ల జిల్లాలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 103 పరీక్షా కేంద్రాల్లో 16,361 మంది రెగ్యులర్, ప్రైవేటు, మరో 438 మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ.. ఒక్కో సెకనూ గంటలా మారింది. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News April 21, 2025

పురుషులు ఈ పదార్థాలు తింటే..

image

పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!