News March 15, 2025
భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
PHOTOS: స్టైలిష్ లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆయన కళ్లజోడుతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. చెర్రీ లేటెస్ట్ లుక్స్ అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC16లో రామ్ చరణ్ నటిస్తున్నారు.
News March 16, 2025
గొల్లపల్లి మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఆదివారం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్లో 40.7, మల్లాపూర్లో 40.6, భీమారంలో 40.6, పెగడపల్లి లో, మెట్పల్లిలో 40.4, ధర్మపురిలో 40.4, కోరుట్లలో 40.4, ఇబ్రహీంపట్నంలో 40.3, ఎండపల్లిలో 40.2, వెల్గటూర్లో 40.2, సారంగాపూర్లో 40.2°C నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
News March 16, 2025
ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. గాంధీనగర్ సురభి బాలవిహార్ స్కూల్ దగ్గర SRK గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉదాన్ ఉత్సవ్–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు.