News March 15, 2025
భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.
News March 16, 2025
సారవకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద పాతపట్నం నర్సంపేట హైవే రోడ్డుపై లారీ కారు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు. ఆదివారం పాతపట్నం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ, నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలో చనిపోయారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 16, 2025
NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.