News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News April 2, 2025
రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.
News April 2, 2025
తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
News April 2, 2025
IPL: హ్యాట్రిక్పై కన్నేసిన RCB

ఐపీఎల్లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.