News March 4, 2025
భర్త ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన పరసా రాధిక తన భర్త ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. పెళ్లై 10 సంవత్సరాలైందని, భర్త ధర్మరాజు తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే ఉద్యోగం సాధించగలిగానని రాధిక తెలిపారు. భర్త గంధం ధర్మరాజు బీటెక్ చదివి సొంత ఊర్లోనే వ్యవసాయం, తేనెటీగల పరిశ్రమ నడుపుతున్నారు. రాధిక దంపతుల కుమారుడు నోయల్ మూడవ తరగతి చదువుతున్నాడు.
Similar News
News March 4, 2025
INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
News March 4, 2025
అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్వర్క్లో చేరి ఆన్లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.
News March 4, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

నిజాంసాగర్కు చెందిన హరికుమార్ (26) ఈనెల 1న ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికుమార్ మృతదేహం ఇవాళ లభ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా హరికుమార్ మద్యానికి బానిసై అర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.