News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News March 31, 2025
చైనా వండర్.. సముద్ర గర్భంలో డేటా సెంటర్

టెక్నాలజీలో చైనా మరో అద్భుతం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా సముద్రం లోపల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. హాంకాంగ్కు ఆగ్నేయ దిశలోని లింగ్ షుయి తీరంలో దీన్ని ప్రారంభించింది. ఇక్కడ 400 హైపెర్ఫార్మెన్స్ సర్వర్లను కూల్ చేసే సౌకర్యాలు ఉంటాయి. ఒక సెకన్లో పారిశ్రామిక రంగం నుంచి మెరైన్ రీసెర్చ్ వరకు 7వేల Ai ప్రశ్నలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ఆరంభమేనని, మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని పేర్కొంది.
News March 31, 2025
1 కాదు, 2 కాదు.. 10 ప్రభుత్వ ఉద్యోగాలు

TG: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో భూపాలపల్లి (D) గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు.
News March 31, 2025
HYD: ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఓటింగ్లో కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ సమీకరణాన్ని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 100% పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.