News March 16, 2025

భీంపూర్: రెండు ఉద్యోగాలకు ఎంపిక

image

భీంపూర్ మండలం అర్లీ(T) గ్రామానికి చెందిన రామెల్లి శివ గ్రూప్-3లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 481 ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 319 ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని శివ పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

ఆదిలాబాద్: ఆరుగురు అరెస్ట్

image

మట్కా నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. కాగా, ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతో పాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

News March 18, 2025

12 నుంచి 4 వరకు బయటకు రావొద్దు : ADB కలెక్టర్

image

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావాలని సూచించారు. బయటకు వెళితే వెళ్లినప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ 4 నెలలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News March 18, 2025

ADB: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

image

ఈనెల 18 నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్‌కు ప్రతిరోజు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రెండు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు మధ్యాహ్నం 3, రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతాయన్నారు. తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 5 గంటలకు, 11:30 గంటలకు బస్ ఉంటుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!