News February 28, 2025

భీమవరం: పంచారామం అన్నదాన సత్రానికి రూ.కోటి విరాళం

image

భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం అన్నదాన సత్రం పిలీగ్రీం సెంటరుకు రూ. కోటి మంజూరైంది. ఈ ప్రత్యేక గ్రాంటును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి భీమవరం MLA,PAC ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులుకి శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఛైర్మన్ DV బాలసుబ్రహ్మణ్యం గురువారం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ CH రంగసాయి పాల్గొన్నారు.

Similar News

News February 28, 2025

పశ్చిమ గోదావరి: పశు పోషకులకు గుడ్ న్యూస్

image

జిల్లాలోని పశువుల రైతులు పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. మార్చి 1 నుంచి మార్చి 30 వరకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, పలు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు.

News February 28, 2025

ద్వారకాతిరుమల: నిమ్మకాయలు అమ్మిన సినీ నటుడు షఫీ

image

ప్రముఖ క్షేత్రం ద్వారకాతిరుమలలో సినీ నటుడు షఫీ నిమ్మకాయలు అమ్మి సందడి చేశారు. నిన్న ఆయన మరో నటుడు మాణిక్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో లింగయ్య చెరువు వద్ద నిమ్మకాయలు అమ్మే మహిళా వ్యాపారులు ఆయన కారును ఆపి, వాటిని కొనాలని కోరారు. వెంటనే కారు దిగిన షఫీ తాను నిమ్మకాయలు అమ్ముతాను అంటూ, వారితో కలిసి సందడి చేశారు.

News February 28, 2025

ప.గో వ్యాప్తంగా 65.43% ఓటింగ్ నమోదు

image

ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సమయానికి 65.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని తెలిపారు.

error: Content is protected !!