News April 19, 2024
భీమిలి నుంచే పోటీ చేస్తున్నా: అవంతి
ఈ ఎన్నికల్లో తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని.. నియోజకవర్గం మారే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ కార్పొరేషన్ 5వ వార్డు సాయిరాం కాలనీలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావే తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ క్యాడర్లో అయోమయం సృష్టిస్తున్నారని.. అనకాపల్లి నుంచి తాను ఎంపీగా పోటీ చేయడమనేది అవాస్తవమని చెప్పారు.
Similar News
News October 11, 2024
భీమిలిలో మానసిక రోగిపై అత్యాచారం..!
భీమిలికి చెందిన ఓ మానసిక రోగిపై ఈనెల 3న అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో మతిస్థిమితం లేని అమ్మాయిని ఓ యువకుడు స్కూటీపై గొట్లాం తీసుకువెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. స్కూటీని ఆమెను స్థానికులు గమనించి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భీమిలి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
News October 11, 2024
విశాఖ: ‘విన్యాసాలతో బంధం బలోపేతం’
ఇండో పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్యం, భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖ నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. విశాఖ తీరంలో నిర్వహిస్తున్న మలబార్-2024 విన్యాసాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ విన్యాసాలతో ఆయా దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుందని వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు.
News October 11, 2024
విద్యుత్ కాంతుల వెలుగులో శంఖు, చక్ర నామాలు
వరహా లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సింహగిరిపై (సింహాచలం) స్వామి వారి శంఖు, చక్ర, నామాలు విద్యుత్ దీప కాంతులతో వెలుగొందుతున్నాయి. దాతల సహాకారంతో నిర్మించిన చేపట్టగా శంఖు, చక్ర, నామాలు ఎట్టకేలకు గురువారం ప్రారంభించారు. విద్యుత్ దీప కాంతులతో అద్భుతంగా దర్శనమిస్తున్న తిలకిస్తున్న భక్తులు ఆనందంతో పులకించి పోతున్నారు.