News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739068459439_51989433-normal-WIFI.webp)
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
Similar News
News February 10, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191580109_51309702-normal-WIFI.webp)
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.
News February 10, 2025
గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739192900136_52384168-normal-WIFI.webp)
గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.
News February 10, 2025
’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191392706_1032-normal-WIFI.webp)
తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.